amp pages | Sakshi

అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా.. రాహుల్‌ భావోద్వేగం! పంత్‌ ఏమన్నాడంటే!

Published on Thu, 06/09/2022 - 11:09

India Vs South Africa 2022 1st T20I: ‘‘ఈ కఠినమైన వాస్తవాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఈరోజు మరో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వదేశంలో జట్టును ముందుండి నడిపించేందుకు వచ్చిన మొట్ట మొదటి అవకాశం చేజారింది. అయితేనేం, మా ఆటగాళ్లకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. 

నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రిషభ్‌ పంత్‌ అండ్‌ బాయ్స్‌కు బెస్టాఫ్‌ లక్‌. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను’’ అంటూ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత జట్టు రాణించాలని ఆకాంక్షించాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నిమిత్తం ప్రొటిస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్లు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కేఎల్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.

అయితే, జూన్‌ 9 నాటి తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా రాహుల్‌ జట్టుకు దూరం కాగా.. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్‌ శర్మ గాయపడటంతో తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్‌ 0-3 తేడాతో ప్రొటిస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది.

నిజమేనా.. జీర్ణించుకోలేకపోతున్నా!
ఇదిలా ఉంటే.. ఆఖరి నిమిషంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్‌ అయిన రిషభ్‌ పంత్‌ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఓ గంట క్రితమే నాకు దీని గురించి తెలిసింది. ఈ ఫీలింగ్‌ చాలా చాలా బాగుంది. భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు.

నా క్రికెట్‌ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని బుధవారం నాటి ప్రీ- మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చాడు. ఇక గురువారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో టీమిండియా- దక్షిణాఫ్రికా జట్లు మొదటి టీ20లో తలపడనున్నాయి. 

చదవండి: Mithali Raj Retirement: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ?!
Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!

Videos

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)