భారత్‌ చెత్త బౌలింగ్‌.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు!

Published on Thu, 01/05/2023 - 20:55

పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్‌ దసన్‌ శనక సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 22 బంతుల్లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (52), అసలంక(37) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు, అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించారు. 
భారత చెత్త బౌలింగ్‌..
భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ మినహా మిగితందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఏకంగా 7 నోబాల్స్‌ వేశారు. అర్ష్‌దీప్‌ సింగ్ ఒక్కడే ఐదు నో బాల్స్‌ వేయడం గమానార్హం. రెండు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్‌ 37 పరుగులు,  ఉమ్రాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులు, శివమ్‌ మావి తన  నాలుగు ఓవర్ల కోటాలో 53 పరుగులు ఇచ్చారు.
చదవండిIND vs SL: ఏంటి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ మర్చిపోయావా? ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ