నితిన్‌కు రెండు పతకాలు

Published on Tue, 05/17/2022 - 08:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అండర్‌– 20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లావత్‌ నితిన్‌ నాయక్‌ రెండు పతకాలు సాధించాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో నితిన్‌ నాయక్‌ పురుషుల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల విభాగంలో రజత పతకం గెల్చుకున్నాడు. కోచ్‌ నేనావత్‌ వినోద్‌ వద్ద శిక్షణ పొందుతున్న నితిన్‌ నాయక్‌ 100 మీటర్లను 10.9 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 200 మీటర్ల రేసును నితిన్‌ 22.4 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో నితిన్‌ వచ్చే నెల 2 నుంచి 4 వరకు గుజరాత్‌లో జరగనున్న జాతీయ అండర్‌–20 ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ