95 ఏళ్ల చరిత్ర.. అమెరికాలో తొలిసారిగా..

Published on Thu, 04/15/2021 - 11:09

లుసాన్‌ (స్విట్జర్లాండ్‌): కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ రద్దయింది. అయితే ఈ ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ప్రకటించింది. అమెరికాలోని హ్యూస్టన్‌ నగరం ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి 29 వరకు ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలకు వేదికగా నిలుస్తుందని ఐటీటీఎఫ్‌ వెల్లడించింది.

కాగా, 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. 1937లో అమెరికా ఏకైకసారి పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత అమెరికా మూడు కాంస్యాలు (1938, 1948, 1949), ఒక రజతం (1947) దక్కించుకుంది. 1949 తర్వాత అమెరికా మరోసారి టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించలేకపోయింది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ