రాజన్న రాజ్యం: ఏపీకి పాదయాత్ర

Published on Sun, 11/22/2020 - 13:25

సాక్షి, మానకొండూర్‌/శంకరపట్నం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆదిలాబాద్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కంపెల్లి గంగాధర్‌ మండిపడ్డారు. తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలని, వైఎస్సార్‌సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు కొనసాగాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు నుంచి ఏపీలోని తాడేపల్లిగూడెం వరకూ చేపట్టిన పాదయాత్ర శనివారం మానకొండూర్‌ మీదుగా సాగింది. కేశవపట్నం చేరుకోగా శంకరపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికారు.

శంకరపట్నంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. మానకొండూర్, శంకరపట్నంలో గంగాధర్‌ మాట్లాడుతూ ఈనెల18న ఉట్నూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అయిందని తెలిపారు. సుమారు వంద కిలోమీటర్లు పూర్తి చేశామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే వైఎస్సార్‌ ఆశయాలు నెరవేరుతాయన్నా రు.

ప్రతీ నిరుపేద సొంతింటి కల వైఎస్సార్‌తోనే నెరవేరిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ఉట్నూర్‌ నుంచి తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో  జిల్లా మహిళా నాయకురాలు రాయశీలం రమ, మేకల భీమ్‌రావు, దత్తూరి పోశెట్టి, మేకల పోషవ్వ ఉన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ