రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఔటర్పై కారు దగ్ధం ఒకరు సజీవ దహనం
Published on Sun, 09/19/2021 - 01:29
శంషాబాద్ రూరల్: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న హోండా అమేజ్ (ఏపీ27–సీ0206) కారు నానక్రాంగూడ టోల్గేటు వద్ద రాత్రి 7.09 గంటలకు ప్రవే శించింది.
అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే కారులో మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న వ్యక్తి కారును రోడ్డు పక్కకు పార్కు చేసేలోపే మంటలు పూర్తిగా వ్యాపించడంతో సజీవ దహనం అయ్యాడు. ఘటన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియరాలే దు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags