-
రోడ్డు ప్రమాదంలో భారీగా నగదు స్వాధీనం..!
-
Medak: రన్నింగ్ కారులో మంటలు.. దగ్ధమైన కారు
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. #A car coming from HYD to Narayankhed burntdown at Bodmatpalli of Medak district on Sunday morning alert driver stopped car on the road side and got other from the car all are safe.@Kalyan_TNIE @balaexpressTNIE @NewIndianXpress pic.twitter.com/ffifPUnHNc— Krishna.panugannti (@Krishna_TNIEsrd) May 5, 2024 -
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కామారెడ్డి జిల్లాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న కారు
-
కారు ప్రమాదం.. ఆ రూమర్స్ గురించి నమ్మొద్దు: సింగర్ మంగ్లీ
టాలీవుడ్లో సెన్సేషనల్ సింగర్ మంగ్లీ.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగిందని వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్-బెంగళూర్ దారిలో ప్రయాణిస్తుండగా ఆమె కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ ఆమె సురక్షితంగా బయటపడ్డారని పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన గురించి మంగ్లీ రియాక్ట్ అయ్యారు. మంగ్లీ తన సోషల్ మీడియాలో.. 'నేను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇది రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.' అని ఆమె పోస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
స్టార్ సింగర్ మంగ్లీ కారుకి ప్రమాదం
సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా గుద్దింది. అయితే ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతింది. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) -
నిమిషాల వ్యవధిలో.. రెండుచోట్ల కారు భీభత్సం!
ఆదిలాబాద్: మండలంలో నిమిషాల వ్యవధిలో జరిగిన ఇరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం మాడగూడ, మోర్కండి గ్రామాలకు చెందిన తొడసం బాలాజీ, నవీన్, మేస్రం భీంరావ్లు బైక్పై ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలో నవీన్(22) మృతిచెందగా మిగితా ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో సీతాగోంది సమీ పంలో మరో మో టార్ సైకిల్పై వెళ్తు న్న మహారాష్ట్ర సమీపంలోని గోసాయి ఉండం గ్రా మానికి చెందిన బడేవాడ్ శ్రీనివాస్, అమృత్రావ్లను సైతం కారు వెనుక నుంచి ఢీకొనగా ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వీరిని అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. కాగా నిమిషాల వ్యవధిలో కారు ఢీకొనడంతో ఒకే కారు వీరిని ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన కారును పట్టుకోవడానికి ఆయా రూట్లలో ఉన్న పోలీసులకు సమాచారం అందించి గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బలిరాం తెలిపారు. ఇవి చదవండి: కలకలం.. ఉత్కంఠ! -
Car Accident: టీ20 వరల్డ్కప్ విన్నింగ్ క్రికెటర్కు గాయాలు
శ్రీలంక మాజీ క్రికెటర్ లాహిరు తిరిమన్నె, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనురాధపుర సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి ఫ్యామిలీ కూడా గాయపడినట్లు న్యూయార్క్ స్ట్రైకర్స్ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన లెఫ్టాండర్ బ్యాటర్ తిరిమన్నె లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2088, 3164, 291 పరుగులు చేశాడు. కెరీర్లో మొత్తంగా మూడు టీ20 వరల్డ్కప్ ఈవెంట్లలో పాల్గొన్న లాహిరు తిరిమన్నె.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు కూడా! అదే విధంగా ఐదు వన్డే మ్యాచ్లకు కెప్టెన్గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. రెండు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం క్యాండీ స్యాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్లోనూ లాహిరు తిరిమన్నె ఆడాడు. 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన తిరిమన్నె గుడికి వెళ్లే క్రమంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. లారీని ఢీకొన్న ఘటనలో అతడి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ లాహిరు తిరిమన్నెతో పాటు అతడి కుటుంబం కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 🚨UPDATE🚨 Lahiru Thirimanne, former Sri Lankan cricketer, hospitalized after a road accident in Thrippane, Anuradhapura.#LahiruThirimanne #SriLanka #Icc #Cricket pic.twitter.com/qqpuYcZ8h5 — Cricadium CRICKET (@Cricadium) March 14, 2024 -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్లో హైదరాబాద్కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారి వివరాలు.. అబ్దుల్ రహమాన్ (62), సలీమా జీ (85), చిన్నారులు వాసిర్ రవుత్ (7 నెలలు), బుస్రా (2), మరియా (5). -
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాప్చెరు పీఎస్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304ఏ కింద లాస్య పీఏ ఆకాశ్పై కేసు నమోదు చేశారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ ఫోన్ చేశారని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్ఆర్ పక్కన రెయిలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
హైదరాబాద్ బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర అకస్మాత్తుగా కారులో చెలరేగిన మంటలు
-
కారు బోల్తా..కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలు
-
రాంగ్ రూట్ లో కారు బీభత్సం.. ఎక్సైజ్ సీఐ మృతి..
-
రోడ్డు ప్రమాదంలో దీదీ తలకు గాయం
కోల్కతా: రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ కారులో బర్ధమాన్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. దీంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్లు వేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను కోల్కతాకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్
-
అటల్ సేతుపై కారు ప్రమాదం
-
Mumbai: అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
ముంబై: ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్లో పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ముంబైలోని అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్లో ఉన్న మరో కారును ఓవర్ టేక్ చేయబోయి వంతెన రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సినిమా రేంజ్లో రెండు పల్టీలు కొట్టింది. అయితే, వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్క్యామ్లో ఇదంతా రికార్డు అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో కారును ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ప్రమాదానికి గురైన వారు రాయ్గఢ్లోని చిర్లేకు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ముంబైలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఇది ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. -
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి
-
కూకట్ పల్లిలో లారీ బీభత్సం..కారు నుజ్జు నుజ్జు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement