చేనుకు నీళ్లు రాకుండా చేశాడని...

Published on Fri, 02/18/2022 - 01:36

చింతకాని: మొక్కజొన్న చేనుకు నీళ్లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, ప్రశ్నించినందుకు ఓ రైతుపై మరో రైతు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన రైతు బొగ్గారపు శ్రీనివాసరావు (55) బుధవారం ఉదయం తన మొక్కజొన్న పంటకు సాగర్‌ నీళ్లు పెట్టేందుకు వెళ్లగా, గ్రామానికి చెందిన రాయల పూర్ణచందర్‌రావు నీరు రాకుండా కాలువకు అడ్డుగా రాళ్లు వేశాడు.

దీంతో శ్రీనివాసరావు మరో వ్యక్తిని వెంటతీసుకుని పూర్ణచందర్‌రావు వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. తన మొక్కజొన్న చేను ఎండిపోతోందని, నీళ్లు రాకుండా అడ్డువేయడం సరికాదని పేర్కొన్నారు. మాటామాటా పెరగడంతో శ్రీనివాసరావు చెంపపై పూర్ణచందర్‌రావు చేయి చేసుకున్నాడు. దీంతో అవమానంగా భావించిన శ్రీనివాసరావు గురువారం తెల్లవారుజామున ఇంటి పెరడులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ