సారూ.. ప్రాణాలు నిలిపారు..!

Published on Sat, 10/10/2020 - 08:35

మధిర: తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఒక సామాన్యుడి ప్రాణాలు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుని పలువురు ప్రశంసలు పొందారు ఖమ్మం జిల్లా మధిర సీఐ. మడుపల్లి గ్రామానికి చెందిన రాఘవయ్య శుక్రవారం చేపలు పట్టేందుకు వైరా నది వద్దకు చేరుకున్నాడు. నీటిలో చేపలు పట్టే క్రమంలో ఒక్కసారి వరద ప్రవాహం పెరిగింది. దీనిని గమనించిన రాఘవయ్య కేకలు వేస్తూ తన ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు కొమ్మలు పట్టుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధిర సీఐ వేణుమాధవ్, టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సీఐ వెంటనే నదిలోకి దిగి తాడు, ట్యూబు సహాయంతో నీటిలో చిక్కుకున్న బాధితుడి వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రాఘవయ్య కుటుంబ సభ్యులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. రాఘవయ్యను కాపాడిన సీఐ వేణుమాధవ్‌ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. (ఐదేళ్ల తరువాత  అమ్మఒడికి..! )

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ