రానున్న రోజుల్లో వారి సంఖ్య రెట్టింపు: నాగార్జున

Published on Fri, 08/14/2020 - 08:26

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను జయించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ప్లాస్మా దానంపై చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలపాలని కోరారు. ఇప్పటివరకు ప్లాస్మా దానం చేసిన వారిని గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం సన్మానించారు. (వాల్వ్‌ల్లేని ‘ఎన్‌–95’లే బెస్ట్‌)

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్లాస్మా దానం చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ముందుకు రావడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా సీపీ సజ్జనార్‌ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేవారు దేవుళ్లతో సమానమని కొనియాడారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల 600 మంది ప్రాణాలు నిలపగలిగామని పేర్కొన్నారు. 

ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 90002 57058, 94906 17440లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు. (మాస్క్‌ ధరించలేదని ఫోన్‌ లాక్కొని..)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ