amp pages | Sakshi

మోదీ విధానాల ఫలితమే దేశాభివృద్ధి

Published on Sun, 02/05/2023 - 04:10

సాక్షి, హైదరాబాద్‌: అగ్రరాజ్యాలు ఆర్థికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన విధానాల ద్వారా దేశాన్ని వృద్ధి పథంలో ఉంచారని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఒకవైపు పేదలను ఆదుకుంటూనే... మౌలిక వస­తుల కల్పనలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా అమృత్‌కాల్‌ సమయంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ పునాదులు వేశారని ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ చెప్పారు.

ఈ నెల ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘కేంద్ర బడ్జెట్‌ 2023–24’ ప్రాముఖ్యతను వివరించేందుకు భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన ఈ మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మూడేళ్లుగా బడ్జెట్‌ల మూలధన వ్యయం పెరుగుతూ వచ్చిందని, రహదారులు, రైల్వేలైన్లు, రైల్వేలైన్ల విద్యుదీకరణ, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు వేయడం వంటి మౌలికరంగ పనుల కోసం ఈ నిధులను ఖర్చుపెట్టడం వల్ల వృద్ధి పెరిగిందని, అదే సమయంలో కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయ­డం వల్ల ద్రవ్యోల్బణం పెద్దగా పెరగలేదని వివరించారు.

2020–21లో మూలధన వ్యయం 3.5 లక్షల కోట్ల రూపాయలుంటే.. తరువాతి సంవత్సరంలో రూ.5.5 లక్షల కోట్లు, 2022–23లో రూ.7.5 లక్షల కోట్లు, తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.10 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. రైల్వే పనుల్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యమిస్తున్నామని, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరించేందుకు రూ.715 కోట్లు కేటాయించామని వివరించారు.  

త్వరలో వందే మెట్రో రైళ్లు...
నగరాల్లో రవాణా కోసం మెట్రో రైళ్లు ఉన్న విధంగానే తక్కువ దూరమున్న రెండు నగరాలను కలిపేందుకు త్వరలో ‘వందే మెట్రో’ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలోని 39 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. సుమారు రూ.521 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ఫ్యాక్టరీకి తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాలు అందించిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని అన్నారు. కార్యక్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేత ప్రేమేందర్‌ రెడ్డి, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.    

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)