ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత

28 Dec, 2015 09:43 IST|Sakshi
రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఎడమవైపు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రాజవొమ్మంగి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఇలాంటి లక్షణాలతోనే 7వ తరగతి విద్యార్థిని దుర్గాజ్యోతి (13) మృతి చెందింది. తాజా పరిణామంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. 
 
 
మరిన్ని వార్తలు