44 మంది ఐపీఎస్ల బదిలీ

27 Oct, 2013 20:13 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 44 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఎస్పీ నుంచి అదనపు డీజీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. 11  జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.

బదిలీ అయిన వారిలో సీనియర్ అధికారులు ఏఆర్ ఆనూరాధ, ఉమేష్ షరాఫ్, వీవీ శ్రీనివాసరావు, జితేందర్, యోగానంద్, ఏఎస్కే దాస్, దామోదర్, గంగాధర్, శివప్రసాద్, సూర్యప్రకాశరావు, డీఎస్ చౌహాన్ తదితరులున్నారు. టీటీడీ ముఖ్య భద్రత అధికారిగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

మరిన్ని వార్తలు