85 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

23 Sep, 2015 17:32 IST|Sakshi

గడివేముల: అక్రమంగా తరలిస్తున్న 85 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండల శివారులో బుధవారం జరిగింది. వివరాలు.. వెలుగోడు, ఆత్మకూరు నుంచి బెంగళూరుకు లారీలో 170 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు