రేపు ఏపీ కేబినెట్ సమావేశం

3 May, 2015 19:25 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం మే 4 న ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఏపీ నూతన రాజధాని భూ సేకరణపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అలాగే విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు ఆమోదం తెలపనుంది. బోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణ ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ బోర్డులో తుడా చైర్మన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకులు, జూన్ 8న నిర్వహించే పునరంకిత సభలపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు