ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంపు

29 Jul, 2014 00:58 IST|Sakshi
ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంపు

మంత్రులు నారాయణ, గంటా

విశాఖపట్నం: ఏటా భూముల ధరలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకున్నట్టే ఆస్తిపన్ను కూడా నిర్దిష్ట శాతం మేరకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ, మానవ వనరులు, విద్యాశాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

వారు సోమవారం విశాఖ నగరంలో విలేకరులతో మాట్లాడారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర అన్ని సంస్థల్ని అనుసంధానిస్తూ రాష్ట్రంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని వారు వివరించారు.
 

మరిన్ని వార్తలు