హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వరుసగా మూడోసారి వాయిదా పడ్డాయి. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో విపక్ష వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని నినాదాలు చేశారు.
చంద్రబాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో స్పీకర్ సభను మూడోసారి వాయిదా వేశారు. అంతకుముందు రెండుసార్లు 10 నిమిషాల చొప్పున సభను వాయిదా వేశారు.