నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

8 Jun, 2017 02:21 IST|Sakshi
సాక్షి అమరావతి: ఏపీ ఎంసెట్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌)  కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ర్యాంకుల వారీగా చేపట్టనున్నారు. ఈ పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కేటగిరీల వారికి ధ్రువపత్రాల పరిశీలన 17వ తేదీ వరకు ఉంటుంది. అభ్యర్థులు ఏ కేంద్రానికైనా వెళ్లి ధ్రువప త్రాలను పరిశీలింపచేసుకోవచ్చు.

దివ్యాంగులు, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్‌ కేటగిరీల అభ్యర్థులు  విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ పరిశీలన కేంద్రం లో మాత్రమే పరిశీలనకు హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరు హాజరు కావాల్సిన తేదీలు ‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీఈఏఎంసీఈటీ. ఎన్‌ఐసీ.ఐఎన్‌’  వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు. వెబ్‌ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 11నుంచి 20 వరకు చేసుకోవచ్చును. జూన్‌ 25వ తేదీన వెబ్‌ ఆధారిత సీట్ల కేటాయింపు జరుగుతుంది. 
మరిన్ని వార్తలు