జిప్‌మర్‌లో భాష్యం విద్యార్థికి సీటు

15 Jun, 2014 00:45 IST|Sakshi

గుంటూరు: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)లో భాష్యం మెడెక్స్ విద్యార్థి షేక్ నబీ దరియావలి సీటు పొందాడని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ శనివారం గుంటూరులో ఒక ప్రకటనలో తెలిపారు. జిప్‌మర్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు సాధించాడని వివరించారు. ఎంసెట్‌లో 35వ ర్యాంకుతో పాటు అఖిల భారతస్థాయి ప్రీ-మెడికల్ ప్రవేశ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంకు సాధించి, జాతీయస్థాయిలో భాష్యం కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేశారని ప్రశంసించారు.

>
మరిన్ని వార్తలు