-

ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

13 Jun, 2015 08:14 IST|Sakshi

రాజమండ్రి:ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సంభవించిన ఘోర ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదకారణాలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. 

 

క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృతి దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నట్లు తెలుస్తోంది.  విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున తిరిగి వస్తుండగా శుక్రవారం రాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు.

మరిన్ని వార్తలు