మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫైర్

25 Mar, 2015 19:20 IST|Sakshi

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైతన్యరాజు వెనుకంజలో ఉండటంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ కచ్చితంగా గెలిచి తీరుతామని అనుకున్నామని, అలాంటిది ఎందుకు తేడా వచ్చిందని అడిగారు. దానికి..చైతన్యరాజు సరైన అభ్యర్థి కాదని నేతలు చెప్పారు. దీంతో చంద్రబాబు మళ్లీ ఆగ్రహించారు.

ఆ విషయం ఏదో ముందే చెబితే అభ్యర్థిని మార్చి ఉండేవాళ్లమని.. మరి ఈసారి మనకు ఉద్యోగులు కూడా ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదాసీనంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ప్రజలు బాగా ఆదరించారని, ఇప్పుడు మాత్రం ఇలా ఎందుకు జరిగిందని అడిగారు. గుంటూరు , కృష్ణా జిల్లాల్లో పోటీ గట్టిగా ఉన్నా అక్కడ గెలిచినప్పుడు.. ఇక్కడ ఎందుకు గెలవలేదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు