గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

7 Mar, 2015 02:54 IST|Sakshi

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాజభవన్‌లో భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. శుక్రవారం హోలీ కావటంతో గవర్నర్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాల సమాచారం.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన  సుగుణమ్మ
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సుగుణమ్మ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెతో ప్రమాణం చేయించారు.

మరిన్ని వార్తలు