నిరుద్యోగులను మోసం చేసిన సీఎం

18 Nov, 2014 02:32 IST|Sakshi

ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవింద్

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవింద్‌ను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగభృతి ఇవ్వాలని, ప్రభుత్వ అలసత్వం వల్ల చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోతున్నారంటూ విద్యార్థులు ర్యాలీగా గురజాడ కళాక్షేత్రం వైపు వెళ్లగా పోలీసులు ఏయూలో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు నిరుద్యోగులును చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు