జనసేనకు మరో షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన కీలక నేతలు

18 Dec, 2023 16:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పా​ర్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. జనసేనకు చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

కాగా, సీఎం జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. రామ్‌ సుధీర్‌ పాటుగా జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాలు కప్పి సీఎం జగన్‌ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు