ఏపీలో కొత్తగా 136 పాజిటివ్‌ కేసులు

10 Jun, 2020 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 136 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 72 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్‌ వల్ల నిన్న తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,126కు చేరింది. 78 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 2,475 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం1,573 మంది కరోనా బాధితులు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. (24 గంటల్లో 279 మంది మృతి)

‘కోవిడ్‌’ కేసుల్లో చార్జ్‌షీట్స్‌! 

>
మరిన్ని వార్తలు