క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

10 Dec, 2015 10:46 IST|Sakshi
రాజమండ్రి: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక అపార్ట్‌మెంట్‌ను కేంద్రంగా చేసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టంగ్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
మరిన్ని వార్తలు