సాక్షి, అనంతపురం: డెంగీ జ్వరాలు అనంతపురం జిల్లాను వణికిస్తున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 48 గంటల్లో 8మంది మృతిచెందారు. మృతి చెందిన వారిలో అరు మంది చిన్నారులు ఉన్నారు.
మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం మడేనహళ్లి గ్రామంలో ఇప్పటి వరకు డెంగీ జ్వరాలతో నలుగురు మృతిచెందారు.