28న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశం

25 Nov, 2014 01:19 IST|Sakshi
28న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశం

 పోలాకి:శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈనెల 28న (శుక్రవారం) ఉదయం 11గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం పోలాకిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయ్‌సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రోజా, తమ్మినేని సీతారాం తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి గ్రామస్థాయి నుంచి పార్టీలో క్రీయాశీలంగా పనిచేస్తున్న శ్రేణులంతా హాజరు కావాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు