డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలి

27 Aug, 2017 01:33 IST|Sakshi
డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలి
భారత్, చైనాలకు నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సూచన
 
సాక్షి, తిరుమల: భారత్, చైనాల మధ్య నెలకొన్న డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సూచించారు. శనివారం తన సతీమణి అర్జూరాణా దేవ్‌బా, ఇతర కుటుంబీకులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో సంస్కృతి, వారసత్వ ,స్నేహ, సుహ్రుద్భావ సంబంధాలు ఉన్నాయని, అందుకే తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. 
మరిన్ని వార్తలు