తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠాగుట్టు రట్టు

13 Feb, 2016 10:47 IST|Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రింటర్, స్క్యానర్తోపాటు రూ. 2 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు