మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

27 May, 2015 16:49 IST|Sakshi

గుంటూరు: మాట్రిక్స్ బయోమాస్ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఓ పరిశ్రమలో వ్యర్ధ పదార్థాలతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన వ్యర్ధ పదార్ధాలకు నిప్పు అంటుకోవడంతో పరిశ్రమలో మంటలు రేగినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెట్టారా ? లేక ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
(కారంపూడి)

మరిన్ని వార్తలు