మొదలైన గోదావరి పుష్కరాలు

7 Jul, 2015 13:08 IST|Sakshi

తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి తీరంలో మరో సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం మంగళవారం  నుంచి పుష్కరాలు మొదలయ్యాయి. శ్రీశైల ఆస్థాన సిద్దాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు గురుడు సింహరాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయని నిర్థారించారు. సూర్యసిద్ధాంతం ఆధారంగానే నిర్ణయించిన ఈ సమయంలో రాజమండ్రి పుష్కరఘాట్లో బుట్టే సిద్ధాంతితోపాటు పలువురు భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాము నిర్ధారించిన సమయమే శాస్త్రోక్తమని తెలిపారు.

 

మరిన్ని వార్తలు