సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ(అప్పా) ఏఎస్పీగా టి.శోభా మంజరి, నెల్లూరు క్రైమ్ ఏఎస్పీగా పి.మనోహర రావు, అనంతపురం అడ్మిన్ ఏఎస్పీగా జి. రామంజనాయులు, సీఐడీ ఏఎస్పీగా ఎన్. వెంకటేశ్వరరావు, గుంటూరు అర్బన్ క్రైమ్ ఏఎస్పీగా ఎం.శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా బి.శరత్ బాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.