జహీరాబాద్, న్యూస్లైన్: సీఎం కిరణ్కు చిత్తూరు జిల్లా అభివృద్ధి తప్ప తెలంగాణ సమస్యలు పట్టవని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి నుంచి జహీరాబాద్ మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు 9వ జాతీయ రహదారి విస్తరణ పనులు సీఎం నిర్లక్ష్యంవల్లే ఆగిపోయాయన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరిగి అమాయకులు మృత్యువాత పడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మరో మంత్రి జె.గీతారెడ్డిలకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టేవరకైనా గుంతలను పూడ్పించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన సంగారెడ్డి-హైదరాబాద్కు రోడ్డు ఐదేళ్లకే రహదారి దెబ్బతిందన్నారు.