టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే.. లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం 

13 Dec, 2023 22:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ వెంటేనని మరోసారి స్పష్టమైంది. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వేలో ఫ్యాన్‌ ప్రభంజనం ఎలా ఉండనుందో వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 సీట్లు సాధిస్తుందని  టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది.

ఇక ప్రతిపక్ష టీడీపీ ఒక్క ఎంపీ స్థానానికి మాత్రమే పరిమితం కావొచ్చని సర్వే అంచనా వేసింది. పవన్‌ కల్యాణ్‌ జనసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఖాతా కూడా తెరవదని టైమ్స్‌ నౌ-ఈటీజీ సర్వే తెలిపింది.

ఇదీ చదవండి: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ 


 

>
మరిన్ని వార్తలు