పాప పుట్టిందని స్వామి దర్శనానికొచ్చా

7 Jun, 2014 09:41 IST|Sakshi
పాప పుట్టిందని స్వామి దర్శనానికొచ్చా

తిరుమల : తనకు పాప పుట్టాలనే కోరిక నెరవేరడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు తమిళ సినీ హీరో కార్తీ తెలిపారు. ఆయన నిన్న  నైవేద్య విరామ సమయంలో భార్య  రంజని, కుమార్తెతో కలిసి  స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కార్తీ మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఒక మందచి సినిమాతో అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీని చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫోటోలు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు