పెరిగిన పార్ట్‌టైమ్ వీఆర్‌వోల గౌరవ వేతనం

12 Feb, 2014 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైమ్ గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓల) గౌరవ వేతనం రూ. 4900 నుంచి రూ. 10,000కు పెరిగింది. ఈమేరకు రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వీఆర్‌వోల సమాఖ్య అధ్యక్షుడు భక్తవత్సల నాయుడు, తెలంగాణ వీఆర్‌వోల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌కు, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్పరాజు వెంకటేశ్వర్లు

మరిన్ని వార్తలు