కనకదుర్గ వారధిపై భారీ అగ్నిప్రమాదం

30 Apr, 2015 11:37 IST|Sakshi

గుంటూరు: వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పేయింట్ వేస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారి వద్ద ఉన్న పేయింట్‌కు యాక్సిడెంట్ ద్వారా పుట్టిన మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిమీద ఉన్న కనకదుర్గ వారధిపై గురువారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు