'కార్నియా సేకరణలో మెరుగైన టెక్నాలజీ అవసరం'

15 Mar, 2015 18:37 IST|Sakshi
'కార్నియా సేకరణలో మెరుగైన టెక్నాలజీ అవసరం'

విజయవాడ: లేజర్ చికిత్సలో కార్నియా సేకరించే విషయంలో మరింత మెరుగైన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కలాం వైద్యులకు పిలుపునిచ్చారు. విజయవాడ తడిగడ్డపలోని ప్రముఖ ఆస్పత్రి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో కంటి వైద్యంలో మరిన్ని ప్రయోగాలు జరగాలని ఆకాంక్షించారు.   అనంతరం ఆయన ఆస్పత్రిలో నూతనంగా ప్రవేశపెట్టిన లేజర్ చికిత్సను ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు