'రైతులను జైళ్లలో పెట్టించిన ఘనత బాబుదే'

11 Dec, 2014 14:24 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ తన తొమ్మిదేళ్ల పాలనను గుర్తుచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులను జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఇప్పుడు ఆయన ప్రకటించి, అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న రుణమాఫీ కూడా అస్తవ్యస్తమేనని అన్నారు.

చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ ఎమ్మెల్యేల మీద ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. రైతుల పక్షాన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించడం వల్లే చంద్రబాబు హడావుడిగా రుణమాఫీ జాబితా విడుదల చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు.

మరిన్ని వార్తలు