జన్-ధన్‌తో పేదరికం తొలగిపోతుంది: బాబు

29 Aug, 2014 03:52 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి/తిరుపతి: జాతీయ ఆర్థిక సమీకృత పథకం ప్రధానమంత్రి జన్-ధన్ యోజనను రాష్ట్రంలో బ్యాంకుమిత్రలతో అనుసంధానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన జన్-ధన్ యోజన పథకాన్ని రాజమండ్రిలో గురువారం ఆయన ప్రారంభించారు. ప్రతి 2 వేల బ్యాంకు ఖాతాలకు ఒక బ్యాంకుమిత్రను నియమిస్తామన్నారు. వారు బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో బ్యాంకులకు రాలేని వృద్ధులు, విక లాంగుల వంటి వారి ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తారన్నారు.  
 
పేదలకు ఆసరా: జన్-ధన్ యోజన పథకాన్ని తిరుపతిలో కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత గంగారామ్ గీతె గురువారం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు