‘మావోయిస్టులు హింస విడనాడాలి’

16 Oct, 2018 10:41 IST|Sakshi
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల తర్వాత ప్రజాప్రతినిధులకు రక్షణ మరింత పెంచామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. విశాఖపట్నంలో ఠాకూర్‌ విలేకరులతో మాట్లాడుతూ..మావోయిస్టులు హింసను విడనాడి..ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. గంజాయి  సాగు, రవాణా చట్టవ్యతిరేకమని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని మావోయిస్టులు అంగీకరించారని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు