సాక్షి, కర్నూలు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. నందికొట్కూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ సహా పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ తప్పక పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యను అందించేలా చూస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖలో పెను మార్పులు తీసుకువచ్చారని.. విద్యను వ్యాపారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.