తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు

29 Jun, 2014 22:56 IST|Sakshi

హైదరాబాద్: తొమ్మిది మంది విద్యార్థులపై పేట్ బషీరాబాద్ పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు..

కొంపల్లి సినీప్లానెట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని చొక్కా గుండి పెట్టుకోలేదని ఈ నెల 26న సీనియర్ విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 12 సమయంలో ఎదురు తిరిగిన జూనియర్ విద్యార్థిపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని ఆదివారం అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు