వామికొండ జలాశయం వద్ద ఉద్రిక్తత

4 Dec, 2017 19:15 IST|Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌ కడప : జిల్లాలోని వామికొండ జలాశయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జలాలకు పూజ చేసేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వామికొండ జలాశయానికి వెళ్లారు. నేతలు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు.. జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, సురేష్‌ బాబులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జలాశయం వద్దకు చేరుకుని నేతలను బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు