అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి దీక్ష భగ్నం

6 Oct, 2013 09:17 IST|Sakshi

సమైక్యాంధ్రకు మద్దతుగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గొట్టిపాటి రవికుమార్ చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షను  ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి గత ఐదు రోజులుగా అద్దంకిలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు కీణిస్తుంది. దాంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఆమరణ నిరాహర దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

మరిన్ని వార్తలు