2,40,824 మంది పిల్లలకు పోలియో చుక్కలు

10 Jan, 2014 02:34 IST|Sakshi
పొందూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1606 కేంద్రాల్లో 2,40,824 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా వైద్య,ఆరోగ ్యశాఖాధికారి గీతాంజలి చెప్పారు. గురువారం పొందూరు 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. సిబ్బంది డ్యూటీ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 19న చుక్కలు వేయిం చుకోని వారికి 20, 21 తేదీల్లో ఇంటింటికి వెళ్లి తమ సిబ్బంది చుక్కలు వేస్తారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులకు వచ్చే లా వైద్యులు సేవలు అందించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో జవహర్ బాలల ఆరోగ్య రక్ష కో ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, స్థానిక వైద్యులు హరనాథరావు, సునీల్ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు