పీలేరు, న్యూస్లైన్: సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు మేజర్ పంచాయతీలో పోస్టల్ బ్యాలెట్లు గల్లంతయ్యూయి. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు 500కు పైగా పోస్టల్ బ్యాలెట్లను ఆ పార్టీ నేతలకు అప్పగించేశారు. రిజిస్టర్ పోస్టులో పంపాల్సిన బ్యాలెట్లను కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణు లు సోమవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.
సీఎం, ఆయన సోదరుని బెదిరింపులకు భయపడి అధికారులు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చేశారంటూ ఆందోళన చేపట్టారు. ఇదే డిమాండ్తో టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా ఆందోళన చేపట్టారు.