ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

12 Jun, 2015 01:20 IST|Sakshi
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలు
పెళ్లకూరు/నెల్లూరు (ఆర్బన్): కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు, కావలిలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. కారు గురువారం వేకువజామున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొంది.

ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అన్న కుమారుడు రామిరెడ్డి యోగీశ్వరెడ్డి, బీద రమేష్‌బాబు, గన్‌మన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. కారు చెట్టును ఢీ కొన్న సమయంలో కారుకున్న ప్రత్యేక బెలూన్లు ఓపెన్ కావడంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పీఏ ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోనులో క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆస్పత్రికి చేరుకొని ప్రతాప్‌రెడ్డిని పరామర్శించారు.

మరిన్ని వార్తలు