పట్టపగలే చోరీ

18 Aug, 2015 16:33 IST|Sakshi

పొదలకూరు (నెల్లూరు) : పట్టపగలే దొంగలు ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిడదవోలు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రైతు మస్తానయ్య భార్యతో కలసి ఉదయం పొలం పనులకు వెళ్లగా .. ఇంటి తాళాలను పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు.

బీరువా తలుపులు తెరచి లోపలున్న రూ.3.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.52వేల నగదును తీసుకుని ఉడాయించారు. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి తిరిగి వచ్చిన మస్తానయ్య దంపతులు చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు జాగిలాలతో గ్రామానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరిన్ని వార్తలు